03-06-2025 04:13:59 PM
మహాదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై నిర్మించిన బస్ షెల్టర్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 60 నుండి 65 సంవత్సరాలు ఉంటుందని, మృతుడి శరీరం మీద నీలి, తెలుపు రంగు గల నిలువు గీతలు గల ఫుల్ షర్టు. గంధం కలర్ లుంగీ కలదు.మృతుడిని గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం మార్చురిలో ఉంచినట్లు మృతుడి ఫోటో గుర్తుపట్టిన వారు కింది నెంబర్లలో 8712658116, 8712658138 సంప్రదించాలని ఎస్సై తెలిపారు.