03-06-2025 03:29:01 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): మిస్ వరల్డ్ పోటీలను(Miss World Competitions) నిర్వహించేందుకు చాలా దేశాలు పోటీ పడ్డాయని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Excise and Tourism Minister Jupally Krishna Rao) పేర్కొన్నారు. ఎన్నో దేశాలతో పోటి పడి హైదరాబాద్ నగరం అవకాశం దక్కించుకుందని, తెలంగాణ పర్యాటక రంగానికి ప్రాచుర్యం కల్పించేందుకే మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించామని తెలిపారు. పోటీల నిర్వహణ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా తెలంగాణకు వచ్చిందని, తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, చేతివృత్తి నైపుణ్యాలు ప్రపంచానికి తెలిసింది. క్రమక్రమంగా తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని, టూరిజం ప్రమోషన్(Tourism Promotion) కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 2017-18లో 27.84 కోట్లు ఖర్చు, ఏటా 20-30 కోట్లు ఖర్చు పెట్టారు.
భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించిందని, గుల్జార హౌస్ అగ్నిప్రమాద స్థలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముగ్గురు మంత్రులను పంపించారని పర్యటక మంత్రి స్పష్టం చేశారు. కొండగట్టు ప్రమాదంలో 70 మంది చనిపోతే ఆనాటి సీఎం కేసీఆర్ అక్కడికి ఎందుకు వెళ్లలేదు..? అని ప్రశ్నించారు. మిస్ వరల్డ్ పోటీల ఖర్చుపై బీఆర్ఎస్ చేసిన ప్రతి ఆరోపణపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం ఉందని, బీఆర్ఎస్ చర్చకు తను సిద్ధం ఉన్నట్లు మంత్రి జూపల్లి వివరించారు.