calender_icon.png 13 November, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ పేలుడు: 13కి చేరిన మృతుల సంఖ్య

13-11-2025 10:54:52 AM

న్యూఢిల్లీ: సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట(Red Fort blast) సమీపంలో జరిగిన పేలుడులో గాయపడిన మరొక వ్యక్తి ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో మరణించడంతో మృతుల సంఖ్య 13కి(Death toll rise) పెరిగిందని అధికారులు గురువారం తెలిపారు. మృతుడిని బిలాల్‌గా గుర్తించారు. భారీ పేలుడులో అతను తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం తెల్లవారుజామున బిలాల్ మరణం గురించి ఆసుపత్రి నుండి సమాచారం అందింది. ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం పరీక్ష ఈరోజు సాయంత్రం జరుగుతుంది. గాయపడిన వారిలో చాలా మంది ఇప్పటికీ నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు, మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.