1 July, 2026 | 6:51 PM

Breaking News

ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •  

కులగణ నిర్ణయం చారిత్రాత్మకం

02-05-2025 10:16 PM

ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్

హనుమకొండ,(విజయక్రాంతి): హసన్ పర్తి మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కుల గణన నిర్ణయం చరిత్రత్మకమైందని కృతజ్ఞతలు తెలుపుతూ హసన్ పర్తి మండల అధ్యక్షులు మారం తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ లు హాజరై, కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ  మోడీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాజిక న్యాయం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బూటకపు మాటలు మానుకోవాలని వారు హెచ్చరించారు. అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం జరుగుతుంది అని ప్రధాని మోడీకి  కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ నాయకులతో పాలాభిషేకం చేశారు.


ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి, రైల్వే బోర్డు మెంబర్స్ దాసరి రాజు, హసన్ పర్తి మండల పార్టీ అధ్యక్షుడు మారం తిరుపతి, మేకల హరిశంకర్, తాళ్ల శ్యామ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి మట్టెడ సుమన్, చకిలం రాజేశ్వరరావు, పెద్దమ్మ శ్రీనివాస్, దాట్ల సునీల్, శీలం బిక్షపతి, రామిశెట్టి అశోక్, రఘుపాల్ రెడ్డి, జనగాం రవీందర్, పట్టాభి రెడ్డి, కుక్కల జ్ఞానేశ్వర్, తిరుపతి రెడ్డి, కందుకూరి శ్రీకాంత్, కోయ్యాడ రాజు పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.