02-07-2025 04:59:31 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ మండలం నగునూర్లోని శ్రీ దుర్గాభవానీ ఆలయం(Sri Durga Bhavani Temple)లో జరుగుతున్న ఆషాడమాసం శాకంబరీ ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ దుర్గాభవానీ అమ్మవారిని అలచంత మాలలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ పూజరులు విశేష హారతులు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యం, చీరెసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మెన్ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు.