01-06-2025 12:05:05 AM
మురళీ కృష్ణంరాజు, శ్రుతిశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘స్కై’. ‘అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే..’ అంటూ ఓ కవితాత్మక కథతో రూపుదిద్దుకుంటోందీ చిత్రం. దీన్ని వాలోర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్పై నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు.
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకలో ‘జర్నీ ఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్’ లాంచ్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘నన్ను నేను హీరోగా కంటే ఒక నటుడిగా భావిస్తా. ఈ సినిమాలో ప్రతిభ గల టీమ్తో పనిచేయడం ఆనందంగా ఉంది.
ఇటీవల ఈ మూవీ స్క్రీనింగ్ చేసినప్పుడు నా క్యారెక్టర్ను మర్చిపోయి సినిమాను ఎంజాయ్ చేశా’ అని తెలిపారు. హీరోయిన్ శ్రుతిశెట్టి మాట్లాడుతూ.. “స్కై’ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. మా టీమ్ అంతా మనసు పెట్టి ఈ సినిమాకు పనిచేశాం. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఎగ్జుటైంగ్గా ఉన్నాం.
మా సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ నచ్చుతుంది” అన్నారు. ‘డైరెక్టర్గా నాకు ఇది డెబ్యూ మూవీ. ఇలాంటి మంచి కథలు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం’ అని డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల తెలిపారు. సినీమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ పృథ్వీ పొయెటిక్ కథతో చాలా ప్యాషనేట్గా ఈ మూవీని రూపొందించారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నా’ అని చెప్పారు.