calender_icon.png 22 February, 2026 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరూర్ తొక్కిసలాట.. ఎన్డీఏ ప్రతినిధి బృందం పర్యటన

29-09-2025 04:47:08 PM

న్యూఢిల్లీ: తమిళనాడు కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనను పరిశీలించడానికి ఎంపీ హేమామాలిని నేతృత్వంలో 8 మంది సభ్యుల ప్రతినిధి బృందాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆదివారం నియమించారు. శనివారం టీవీకే అధినేత విజయ్(TVK Chief Vijay) నిర్వహించిన ర్యాలీలో అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించి నివేదిక సమర్పించడానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP President JP Naddaఎన్డీఏ(National Democratic Alliance) ఎంపీల ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేశారు.

బీజేపీ సాధారణంగా విషాద సంఘటనలు జరిగిన ప్రదేశాలకు విచారణ కోసం తన సొంత నాయకులను పంపుతుంది. కానీ ఈసారి పార్టీ తన మిత్రపార్టీలైన శివసేన, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుండి 8 మంది ఎంపీలతో కమిటీని ఎంపీ హేమామాలిని నేతృత్వంలో నియమించింది.

మధురకు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ, తమిళ నటి హేమ మాలిని ఈ ప్రతినిధి బృందానికి కన్వీనర్‌గా ఉన్నారు. కమిటీ సభ్యులలో శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే, టీడీపీకి చెందిన పుట్టా మహేష్ కుమార్ తో పాటు అనురాగ్ ఠాకూర్, తేజస్విని, బ్రిజ్ లాల్, అపరాజిత సారంగి, రేఖా శర్మ ఉన్నారు.