27-10-2025 10:21:19 PM
చర్ల (విజయక్రాంతి): ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పిల్లూర్ అడవులలో మావోయిస్టులు నిర్మించిన మావోయిస్టు స్మారక చిహ్నాన్ని కూల్చివేశారు. డి ఆర్ జి/సి ఆర్ పి యూ 214, కోబ్రా 206 ల సంయుక్త ఆపరేషన్ నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా, పిల్లూర్ అడవులలో మావోయిస్టులు నిర్మించిన 20 అడుగుల ఎత్తైన మావోయిస్టు స్మారక చిహ్నాన్ని భద్రతా దళాలు సోమవారం కూల్చివేశాయి. మావోయిస్టులపై ప్రభావవంతమైన చర్య కొనసాగుతోంది.