మేక మన్వితను సన్మానించిన డీఈవో
05-05-2026 08:31 PM
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని నాగుపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని మేక మాన్విత పడవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను 571 అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థిని మేక మాన్వితను మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యా శాఖాధికారి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈ.ఓ జగపతి, నాగుపల్లి జెడ్పీహెచెస్ ప్రధానోపాధ్యాయరాలు కందిమళ్ళ సరళ తదితరులు ఉన్నారు.






