17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బీసీ రిజర్వేషన్లపై అనుకూల తీర్పు వస్తుంది: భట్టి విక్రమార్క

06-10-2025 12:35 PM

హైదరాబాద్: స్థానిక సంస్థల్లో 42శాతం బీసీ రిజర్వేషన్(BC Reservations)లపై సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీరికల్ డాటా ఆధారంగా రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం ఎంపీరికల్ డాటాతో సీపెక్స్ సర్వే చేసిందని వెల్లడించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు గట్టిగా వినిపిస్తామని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు.

రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో పోరాడతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి ఢిల్లీకి బయలుదేరారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున బలమైన వాదనలు వినిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లి సీనియర్ న్యాయవాదులను కలిసి న్యాయపరమైన అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పక్షాన బలమైన వాదనలు వినిపించాలని సూచనలు చేశారు.