12 June, 2026 | 2:23 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

నేటి జల్‌జీవన్‌ మిషన్‌కు.. నాటి సత్యసాయి పథకమే అంకురం

19-11-2025 12:41 PM

సత్యసాయి మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం

పుట్టపర్తి: సత్యసాయి గొప్పదనం గురించి విదేశీయులు చెబుతారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో మాట్లాడుతూ, విదేశాల్లో సాయి భక్తులను చాలామందిని చూశానని పేర్కొన్నారు. సత్యసాయి అత్యంత వెనుకబడిన జిల్లాలో వెలిశారని తెలిపారు. సత్యసాయి తన జన్మకు ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారని వివరించారు. సామాన్యుడికి తాగునీరు ఇవ్వాలని సత్యసాయి ఆలోచించారని తెలిపారు. తాగునీటి పథకానికి రూ. 400 కోట్లు సత్యసాయి వెచ్చించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేటి జల్ జీవన్ మిషన్ కు నాటి సత్యసాయి పథకమే అంకురం అన్నారు. సత్యసాయి వేల మంది భక్తులను ప్రభావితం చేస్తారు.. సత్యసాయి మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం అన్నారు. పుట్టపర్తిలో ఘనంగా శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయి కుల్వంత్ హాల్ లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు.