calender_icon.png 19 November, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శబరిమలలో భక్తుల రద్దీ.. అయ్యప్ప దర్శనానికి 18 గంటల సమయం

19-11-2025 01:42:14 PM

శబరిమలకేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప(Sabarimala Ayyappa Temple) ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. అయ్యప్ప దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. కిలో మీటర్ల మేర అయ్యప్ప భక్తులు పడిగాపులు కాస్తున్నారు. భక్తల రద్దీని నియంత్రించడానికి ఆలయంలో సిబ్బంది కొరత ఉన్నట్లు సమాచారం. శబరిమలలో సరైన ఏర్పాట్లు చేయలేదని అయ్యప్ప భక్తులు(Ayyappa devotees) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శబరిమల పరిసరాల్లో 17 మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాట్లు చేశారు. నిన్న క్యూలైన్ లో మహిళా భక్తురాలు మృతి చెందిన విషయం తెలిసిందే.

శబరిమల వద్ద దాదాపు రెండు లక్షల మంది భక్తుల రద్దీ నిర్వహణ వ్యవస్థలను ముంచెత్తిన ఒక రోజు తర్వాత, యాత్రికుల ప్రవాహాన్ని నియంత్రించడానికి ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టిడిబి), పోలీసులు బుధవారం నుండి కఠినమైన ఆంక్షలు విధించారు. 18 మెట్ల ముందు భక్తులు కిక్కిరిసి ఉండటం, పంబా-సన్నిధానం మార్గంలో చాలా ఆలస్యం కావడం, క్యూలలో తాగునీరు లేకపోవడంపై ఫిర్యాదులు రావడం వంటి దృశ్యాల తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు. శబరిమలలో రోజుకు 20,000 మందిని మాత్రమే అయ్యప్ప దర్శనం కోసం అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.