15 June, 2026 | 2:50 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం పర్యటన

03-02-2025 12:45 AM

వైరా, ఫిబ్రవరి 2: ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్క దంపతులు పర్యటించి తన సోదరుడు డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత మల్లు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత సోదరుడి సమాధి వద్ద పుష్పగుచ్ఛం శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.4 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులు, పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, లీడర్లు శీలం వెంకట నర్సిరెడ్డి, దొడ్డా పుల్లయ్య, ఏదునూరి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.