calender_icon.png 28 June, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పాలనలో గ్రామాలు అభివృద్ధి

28-06-2025 12:05:56 AM

- ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేస్తాం... ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి 

చారకొండ జూన్ 27: కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు డా. చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డిలు అన్నారు. శుక్రవారం చారకొండ నుండి చాంద్రాయణపల్లి వరకు 4.50 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు, తుర్కలపల్లి, గోకారం రహదారిపై రూ. 4.60 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గంలోనీ ప్రతి మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా రహదారి లేక చంద్రాయన్ పల్లి, గోకారం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

త్వరగతిన బీటీ రోడ్డు పనులను ప్రారంభించి ప్రజల సమస్యలు తీర్చాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ బాలాజీ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ గౌడ్, మండల అధ్యక్షులు బలరాం గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాంబయ్య గౌడ్, దశరథం, సహదేవ్, మహేందర్, పర్వతాలు, శంకర్, వెంకటయ్య తదితరులుపాల్గొన్నారు.