calender_icon.png 28 June, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ వేదికగా ది హౌస్ ఆఫ్ ఎంబీజే ఆధ్వర్యంలో తరాశ్ జ్యూవెల్లరీ ఎగ్జిబిషన్

28-06-2025 12:05:43 AM

కనువిందు చేయనున్న జైపూర్ పోల్కీ ఆభరణాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27(విజయక్రాంతి): భారత ఆభరణ రంగంలో అగ్ర గామిగా పేరుగాంచిన ది హౌస్ ఆఫ్ ఎమ్‌బీజే సంస్థ, రాజస్థాన్‌కు చెందిన అసలైన పోల్కీ ఆభరణాలను ప్రదర్శించే అత్యంత ప్రఖ్యాతమైన ‘తరాశ్‘ కలెక్షన్‌ను జూన్ 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లోని ది పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించబోతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 

ఎగ్జిబిషన్ పోస్టర్‌ను సోమాజిగూడలో శుక్రవారం ఆవిష్కరించారు. రాబోయే వివాహ సీజన్ దృష్టిలో ఉం చుకొని, ప్రతి ఆభరణాలను ప్రత్యేకమైన డిజైన్‌తో, అత్యుత్తమ నైపుణ్యంతో రూపొందించి నట్టు నిర్వాహకులు గౌతమ్ సోని,  అభిషేక్ సోని మీడియాకు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ ఉదయం 11 గంట ల నుంచి మొదలుకానుంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో వరుసగా 13 సంవత్సరాలుగా వీరు ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు.