సంక్షేమం అభివృద్ధి జోడెడ్లుగా సాగాలి
- అధికారుల పనితీరుపై నెలనెలా నివేదికలు
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం, జూన్ 9 (విజయక్రాంతి): సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లలా సాగాలని, నేటి నుంచి పాలన పరుగులు పెట్టించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిరలో అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన అందించాలంటే అధికారులు చిత్తశుద్ధితో ప నిచేయాలని కోరారు. అధికారుల పనితీరు ను బట్టి బదిలీలు ఉంటాయని చెప్పారు. సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ నెలనెలా నివేదికలు తెప్పించుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మూడేళ్లకు పైగా ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగులకు స్థానచలనం కల్గించాలని ఆదేశాలు జారీచేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి చేరవేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని ఉద్ఘాటిం చారు. మున్సిపల్, నీటిపారుదల, విద్యుత్తుశాఖ అధికారులతో వివిధ అభివృద్ధి పనుల పై సమీక్షించారు.
12, 13 తేదీల్లో మరోసారి సమీక్ష
ఈ నెల ౧౨న ఖమ్మంలో జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి మరోసారి అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పురోగతి, వైరా రిజర్వాయర్కు సాగర్ కాల్వల అనుసంధానం, నాగార్జనసాగర్ ఎడమ కాలువ నిర్వహణ పనులపై సమీక్షించనున్నారు.






