30-05-2025 12:16:57 AM
దశాబ్దాల నాటి ప్రజల కష్టాలకు పరిష్కారం దొరికింది : ఎమ్మెల్యే సాంబశివరావు.
భద్రాద్రి కొత్తగూడెం, మే 29 (విజయ క్రాంతి) మారుమూల ప్రాంతాల అభివృద్ధి రహదారులు , రవాణాలతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. గురువారం పాత పాల్వంచ నుండి పెనుబల్లి రోడ్డు 0/600 వద్ద రూ 6.50 కోట్లతో నిర్మించునున్న హై లెవెల్ బ్రిడ్జి పనులకు స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, భద్రాచలం శా సనసభ్యులు తెల్లం వెంకట్రావు తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆధునిక యుగంలో హైవే లు, స్కై వేలు , ఫ్లై వేలు అన్ని వచ్చినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో ఇప్పటివరకు వన్ వేలు కూడా రాలేదని అన్నారు. దానిని దృ ష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతి గూడెం, తండాకు, గ్రామాలకు పంచాయతీలకు , మండలాలకు రోడ్డు కనెక్టివిటీ ఉండే విధం గా రహదారుల నిర్మాణం చేపడుతుందన్నా రు.
ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలు మారుమూల ప్రాంతాల ప్రజలకు అందించడానికి రహదారులు ముఖ్యమన్నా రు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాం తం అని చెప్పాలంటే ఆ ప్రాంతానికి కమ్యూనికేషన్ , కనెక్టివిటీ తప్పనిసరి అన్నారు. ప్రా ణాపాయ స్థితిలో ఉన్న మారుమూల ప్రాం తాల ప్రజలు, గర్భిణీలు వాగులు వంకలు దాటాలంటే బ్రిడ్జిల అవసరం ఎంతో ఉందన్నారు.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనే ని సాంబశివరావు మాట్లాడుతూ.
దశాబ్దాల నాటి పెనుబల్లి గ్రామ ప్రజల ఇబ్బందులకు బ్రిడ్జి నిర్మాణంతో పరిష్కారం దొరికిందన్నా రు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా బ్రిడ్జి ని ర్మాణంలో మార్పు చేసి అవసరమైతే ఇంకా ఎక్కువ నిధులు కేటాయిస్తామన్నారు.
.మా రుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ర హదారులతో పాటు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, కమిషనర్ సుజాత, ఎంపీడీవో మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.