30-05-2025 12:17:29 AM
బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్
పెబ్బేరు మే 29 :ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తడిసిన ధాన్యాన్ని రైతులనుంచి తక్షణమే కొనుగోలు చేయాలని బిసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్ కోరారు.
గురువారం ఉదయం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యా న్ని ఆయన పరిశీలించారు. చాలా బాగం తడిసిన ధాన్యం ఉండటం గమనించారు. రైతులతో మాట్లాడి పలువిషయాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రైతులు కష్టపడి పండించిన పంట నీటిపాపాలౌతుంటే అధికారుల సమన్వయలోపంతో రైతులకు తీవ్ర అన్యాయం జరు గుతోందని ఆరోపించారు. అధికారులు స్పం దించి వెంటనే చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.