03-06-2025 12:00:00 AM
ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు
మంచిర్యాల, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి బాట పట్టిందని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా నెరవేర్చుతూ వస్తున్నామన్నారు. అనంతరం బైపాస్ రోడ్డులో గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.