19-12-2025 01:52:00 AM
ఉప్పల్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లోని భవానినగర్ ఓల్ విలేజ్ ఎర్రకుంట కాలనీలో సుమారు రూ.71 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేవలం రెం డు నెలల కాలంలోనే సుమారు రూ.9 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
నాచారం రైతు బజార్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో పేద మధ్యతరగతి ప్రజలు శుభకార్యాలు చేసుకోవడానికి వీలుండేలా మల్టీ పర్ప స్ ఫంక్షన్ హాల్ తొందర్లోనే నిర్మిస్తామని తెలిపారు. మంజూరైన అభివృద్ధి పనులను వెంట నే ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇం జనీర్ బాలకృష్ణ అసిస్టెంట్ ఇంజనీర్ వినీత్, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు