18 April, 2026 | 11:49 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

క్రిస్మస్ విందును క్రైస్తవులు బహిష్కరించాలి

19-12-2025 01:53 AM

జెరూసలేం మత్తయ్య పిలుపు..

ముషీరాబాద్, డిసెంబర్18  (విజయక్రాం తి):  క్రైస్తవులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈనెల 20న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ డిన్నర్ ను క్రైస్తవులు బహిష్కరించాలని క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షులు జెరూసలేం మత్తయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  గతంలో ప్రభుత్వం క్రైస్తవులకు ఇచ్చిన హామీ ప్రతులను ప్రదర్శించారు.

అనంతరం మత్త య్య మాట్లాడుతూ.. ఎన్నికల మానిఫెస్టో, మైనారిటీ డిక్లరేషన్, క్రిస్టియన్ డిక్లరేషన్ లలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, వేదికపైకి వచ్చిన క్రైస్తవ నాయకు లు నల్లజెండాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరస న తెలిపాలని అన్నారు. ముస్లింలకు హజ్‌యాత్ర, క్రైస్తవులకు జెరుషలేము యాత్ర, పాస్టర్లకు రూ.10 వేల గౌరవ వేతనం, క్రైస్తవ సమాధులకు స్థలాలు కేటాయింపు లేదని, ముస్లిం మైనార్టీల తోపాటు క్రైస్తవులకు రావాల్సిన రూ.200 కోట్ల నిధులు క్రిస్టియన్ కార్పొరేషన్ కు కేటాయించడం లేదని ఆయన ఆరోపించారు.