అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు
17-04-2026 09:34 PM
* ఏడుపాయల్లో వీధి దీపాలు లేక చీకటిమయం
* భయాందోళనకు గురవుతున్న భక్తులు
పాపన్నపేట: దేశంలోనే రెండో వన దుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సరుపయోగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం ప్రధాన కూడల్లు అంధకారం అలుముకున్నాయి. దీంతో వనదుర్గమ్మ భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు అడవి, చుట్టూ చీకటి అలుముకోవడంతో ఎటు నుంచి ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. మహిళా భక్తులకు దొంగల భయం చుట్టుకుంది. ఇళ్ల మధ్య, ప్రధాన కూడల్ల వద్దే బైకులపై వచ్చి మెడలో బంగారు గొలుసులు దొంగలిస్తున్నారని.. అలాంటిది ఏడుపాయల్లోని ప్రదేశంలో మహిళా భక్తుల పరిస్థితి ఏంటని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.






