28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

అడిగినోడు నక్సలైట్.. అడగనోడు ఆల్ రైటా!

18-06-2025 12:29 AM

సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి

ముషీరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): ఎక్కడ అణిచివేత, పీడనం దోపిడీ ఉంటుందో..అక్కడ ఉద్యమం ఉంటుందని, అందుకు అడిగినోడు నక్సలైట్... అడగనోడు ఆల్ రైటా ఆ .! అని ప్రముఖ సినీ నటుడు, దర్శకులు ఆర్. నారాయణమూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్  పేరిట సాగిస్తున్న హత్యాకాండను వెంటనే ఆపాలని  డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద సభ అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన మహాధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.

ఈ  కార్యక్రమానికి పలువురు ముఖ్య నేతలు, వివిధ పార్టీల నాయకులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ నటుడు ఆర్.  నారాయణ మూర్తి మాట్లాడుతూ చంపాల్సింది  అణిచివేతను దోపిడిని అని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సమాజంలో శాంతిని కాపాడి ప్రజలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, రాజ్యాంగపరమైన హక్కులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం, సిపిఐఎంఎల్ నేతలు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు  తమ్మినేని వీరభద్రం, వేములపల్లి వెంకటరామయ్య, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, దాసోజు శ్రవణ్ కుమార్, నెల్లికంటి సత్యం, ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వరరావు, వినాయక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.