calender_icon.png 27 October, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోరబండలో భక్తి పూర్వకంగా అయ్యప్ప మాలధారణ కార్యక్రమం

27-10-2025 07:28:21 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): శ్రీ శబరి గిరీశ మహా పాదయాత్ర సమితి ఆధ్వర్యంలో మాలధారణ కార్యక్రమం ఈరోజు ఉదయం బోరబండ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గురుస్వామి సాయి కిరణ్ గౌడ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంలో కిషోర్ స్వామి, ఎలందర్ స్వామి, శివ స్వామి, వంశీ స్వామి, నాగరాజు స్వామి, నాని స్వామి, రామకృష్ణ స్వామి తదితర అయ్యప్ప భక్తులు పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగమయ్యారు.