31-12-2025 12:00:00 AM
గిరిపురం గ్రామ సర్పంచ్ నీలా సైదులు
మరిపెడ, డిసెంబర్ 30 (విజయక్రాంతి): నట్టల నివారణ మందుతో మూగజీవుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పశువైద్యాధికారి రందాన్ పేర్కొన్నారు. మరిపెడ మండలం గిరిపురంలో గ్రామ సర్పంచ్ నీలా సైదులు చేతుల మీదుగా నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గొర్రెల, మేకల పెంపకం దారులు గొర్రెలకు, మేకలకు నట్టల మందు తప్పకుండా తాగించాలని, ఈ మందు ద్వారా మరణాలు తగ్గి ,జీవాల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు వల్లేపు కొండయ్య, పట్ల మల్లయ్య, పెద్ధబోయిన కుమార్ స్వామి, పెధ్దబోయిన సమ్మయ్య, రైతు వెంకన్న, వల్లపు సమ్మయ్య, పట్ల వంశీ తదితరులు పాల్గొన్నారు.