30-05-2025 12:33:40 AM
పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ‘తెలంగాణ మార్చ్’ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు (వీహెచ్) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందని, లోక్సభ, రాజ్యసభలో కూడా వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ధర్నాకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.