03-11-2025 12:00:00 AM
ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజకుమార్
మందమర్రి, నవంబర్ 2 : సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఈనెల 8న అన్ని జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు గుర్తింపు సంఘం ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్ స్పష్టం చేశారు. పట్టణం లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మూడుసార్లు స్ట్రక్చర్ సమావేశాలు జరగగా ఇందులో ఒకసారి సిఅండ్ ఎండి తో, రెండుసార్లు డైరెక్టర్ పా తో సమావేశాలు జరిగిన ప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారంకు నోచుకోలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. గత మార్చి నెల నుండి ఇప్పటి వరకు ఎనిమిది నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించ కుండా కార్మికులకు వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చకుండా యజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని యజమాన్యం తీరుపై విరుచుకుపడ్డారు.
సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని, పేరక్స్ పై కొలిండియా మాదిరిగా సింగరేణి యాజమాన్యమే ఐటీనీ భరించాలని, మారుపేర్లను సవరించి విజిలెన్స్ ఇబ్బందు లను తొలగించాలని, 150 మస్టర్ల నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లతో ఈనెల 6న సింగ రేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లపై, 8న జిఎం కార్యాలయాలు ఎదుట ధర్నాను కార్మికులు విజయవంతం చేయాలని కోరా రు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్య నారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్,బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, అసిస్టెంట్ సెక్రటరీ సోమిశెట్టి రాజేశం, జాయింట్ సెక్రెటరీ కంది శ్రీనివాస్, మైనింగ్ స్టాప్ నాయకులు గోపతి సత్యనారాయణ, సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, లింగయ్య, జెట్టి మల్ల య్య, ఏరియా నాయకులు సీవీ రమణ, ఎగ్గెటి. రాజేశ్వరరావు, ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, అంతోని దినేష్, సిపిఐ నాయకులు కామెర దుర్గరాజు పాల్గొన్నారు.