26 March, 2026 | 12:26 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

సీసీఐ కేంద్రం వద్ద పత్తి రైతుల ధర్నా

08-11-2024 01:06 AM

తేమ పేరుతో కొనుగోళ్లను నిరాకరించడంపై మండిపాటు

నాగర్‌కర్నూల్, నవంబర్ 7 (విజయక్రాంతి): తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో పత్తి రైతులు ధర్నాకు దిగారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద గురువారం జరిగింది. రైతులు తెచ్చిన పత్తిని అధికారులు నామమాత్రంగా పరీక్షలు జరిపి తేమ శాతం ఎక్కువగా ఉందంటూ కొనుగోళ్లు నిలిపివేశారని రైతులు వాపోయారు.

దళారులు తెచ్చిన పత్తిని మాత్రం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. దళారులు, అధికారులు కుమ్మక్కై తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ధర్నాతో నాగర్‌కర్నూల్-అచ్చంపేట ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. తెలకపల్లి ఎస్సై నరేష్ సంఘటన స్థలానికి వెళ్లి రైతులకు సర్ది చెప్పారు.