16 March, 2026 | 9:49 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

సీసీఐ కేంద్రం వద్ద పత్తి రైతుల ధర్నా

08-11-2024 01:06 AM

తేమ పేరుతో కొనుగోళ్లను నిరాకరించడంపై మండిపాటు

నాగర్‌కర్నూల్, నవంబర్ 7 (విజయక్రాంతి): తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో పత్తి రైతులు ధర్నాకు దిగారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద గురువారం జరిగింది. రైతులు తెచ్చిన పత్తిని అధికారులు నామమాత్రంగా పరీక్షలు జరిపి తేమ శాతం ఎక్కువగా ఉందంటూ కొనుగోళ్లు నిలిపివేశారని రైతులు వాపోయారు.

దళారులు తెచ్చిన పత్తిని మాత్రం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. దళారులు, అధికారులు కుమ్మక్కై తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ధర్నాతో నాగర్‌కర్నూల్-అచ్చంపేట ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. తెలకపల్లి ఎస్సై నరేష్ సంఘటన స్థలానికి వెళ్లి రైతులకు సర్ది చెప్పారు.