calender_icon.png 21 June, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథ, పాత్రలను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు

10-09-2024 12:53:48 AM

‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వస్తోంది ‘మత్తువదలరా2’. శ్రీసింహ కోడూరి లీడ్ రోల్‌లో తన సైడ్ కిక్‌గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా  హీరోయిన్‌గా నటిస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీసింహ సోమవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. “మత్తువదలరా2’ ప్రిపరేషన్ -చాలా బాగా జరిగింది. గెటప్, క్యారెక్టర్స్ స్టయిలింగ్ మారింది. ‘హీ’ టీం ఏజెంట్స్‌గా చూపించాం. ఫస్ట్ పార్ట్ కన్నా యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.

ఫస్ట్ పార్ట్ హిట్ అయిన తర్వాత సీక్వెల్ చేద్దామని నాకు, చెర్రీకి ఉండేది. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతాయి. డెలివరీ బాయ్స్ నుంచి ఏజెంట్స్ ఎలా అయ్యారనే లింక్ చూపిస్తాం. ఈ కథ ఫస్ట్ పార్ట్‌కి మ్యాచ్ అయ్యేలా ఆర్గానిక్‌గా వచ్చింది. అందుకే నేచురల్‌గా అంతా సెట్ అయ్యింది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్‌దే. సోషల్ మీడియాతో పరిచయం లేని ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే కథ, క్యారెక్టర్స్ ఉంటాయి. ఫన్, థ్రిల్ డబుల్ ఉంటుంది. ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేసినపుడు టీజర్ ట్రైలర్ సాంగ్ చూసి చాలా ఎక్సయిట్ అయ్యారు. -రాజమౌళికి టీజర్, ట్రైలర్ చాలా నచ్చాయి. చాలా ఎంజాయ్ చేశారు. నా కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ డెవలప్‌మెంట్‌లో ఉన్నాయి. ఇది అయిన తర్వాత వన్ బై వన్ చేయాలనేది నా ఆలోచన” అన్నారు.