టాటా ప్లేలో డిస్నీ వాటా విక్రయం
విలువ 1 బిలియన్ డాలర్లు
ముంబై, మే 22: టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ టాటా ప్లేలో వాల్ట్ డిస్నీకి ఉన్న మైనారిటీ వాటాను విక్రయించాలని నిర్ణయిం చింది. టాటా ప్లేలో డిస్నీకి 29.8 శాతం వాటా ఉన్నది. దీనిని టాటా గ్రూప్కే 1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.8,300 కోట్లు) విక్రయించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాటాను కొనుగోలు చేసిన తర్వాత ఈ టీవీ ప్లాట్ఫాంను పూర్తి ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలని టాటా గ్రూప్ భావిస్తున్నది. వాల్డ్ డిస్నీ తన ఇండియా యూని ట్ను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని వయోకామ్ 18 మీడియాకు విక్రయించడానికి ఒ ప్పందంపై సంతకాలు చేసింది. సెట్టాప్ బాక్సుల ద్వారా పే టెలివిజన్ ఛానళ్లను, యా ప్ ద్వారా వీడియో స్ట్రీమింగ్ను అందించే టాటా ప్లేకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.






