హిందుస్థాన్ జింక్ నెలరోజుల్లో డబుల్
వెండి ఎఫెక్ట్
ముంబై, మే 22: వేదాంత గ్రూప్ యాజమాన్యంలో ఉన్న హిందుస్థాన్ జింక్ షేర్లు నెలరోజుల్లో రెట్టింపయ్యాయి. దేశంలో వెండిని ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీ అయిన హింద్ జింక్ బుధవారం బీఎస్ఈలో 8.75 శాతం పెరిగి ఆల్టైమ్ గరిష్ఠస్థాయి రూ. 807 వద్దకు చేరింది. ఆరు రోజులపాటు నాన్ ర్యాలీ జరపడంతో ఈ షేరు మార్కెట్ విలువ సైతం రూ.3 లక్షల కోట్ల స్థాయిని అధిగమించింది. హిందుస్థాన్ జింక్ ఆదాయంలో చాలావరకూ జింక్ ఉత్పత్తి ద్వారా లభిస్తున్నప్పటికీ, దేశంలో వెండిని ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీయే కాదు.. 2023 రికార్డుస్థాయిలో వెండిని ఉత్పత్తి చేసి ప్రపంచంలో వెండి ఉత్పత్తి చేసే కంపెనీల్లో మూడో స్థానానికి ఎగబాకింది. 2024 హిందుస్థాన్ జింక్ వెండి అమ్మకాలు 27 శాతం వృద్ధితో రూ. 6,840 కోట్లకు చేరతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






