15 June, 2026 | 10:21 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ

19-12-2025 09:03 PM

58వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి లోహిత రాజు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లిలో స్థానిక కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు ఆధ్వర్యంలో పుల్లూరు నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ మెంబర్ నమిండ్ల అజయ్ కుమార్ ద్వారా పేద వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.

అనంతరం వారు మాట్లాడుతూ... శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండటం వలన పేద ప్రజలు ఇబ్బందుల పడుతున్నారు. అందుకు మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అపన్నులకు అండగా ఉడతా భక్తిగా ఉండాలని సదుద్దేశంతో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి ప్రసంగి, సుదర్శన్, ఫిలిప్స్, ఇమ్మడి సుధాకర్, ప్రభాకర్, నల్ల ప్రశాంత్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.