27-05-2025 12:00:00 AM
చండూరు, మే 26: గట్టుప్పల మండల పరిధిలోని తెరటుపల్లి, కమ్మ గూడెం గ్రామాలకు చెందిన బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.
చెక్కులు తీసుకుని వారిలో తేరటుపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల యాదయ్య కు రూ. 60 వేలు, పుష్ప పాపమ్మ రూ. 60 వేలు, బొడ్డుపల్లి సైదులు రూ. 49 వేలు అదేవిధంగా కమ్మగూడెం గ్రామానికి చెందిన బాల కిరణ్ రూ. 12 వేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటుందని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి రాములు, బండారి అంజి, పగిళ్ల కోటి, చిలుకూరి వెంకటేశం, బరిగెల ధర్మయ్య, అశోక్, శేఖర్, శౌరిలు, గోలి ప్రసాద్, శ్రీను, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.