28 February, 2026 | 11:07 PM

పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ

28-02-2026 09:23 PM

నవాబ్ పేట్: మండలంలోని ఎన్మన్ గండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలల్లో శనివారం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు. గోనయో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై (SI) విక్రమ్, ఫౌండేషన్ స్థాపకులు సంతోష్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు ప్యాడ్లను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లక్ష్మీనారాయణ, గణేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.