21-06-2025 08:12:04 PM
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి(Professor Jayashankar Sir death anniversary) వేడుకలు శనివారం నస్పూర్ లోని మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావు సార్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, టీ బీ జీ కే ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.