calender_icon.png 23 November, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగిరెడ్డిపేటలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

23-11-2025 07:57:32 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట్, ధర్మారెడ్డి, మాసానిపల్లి, నాగిరెడ్డిపేట గ్రామాలతో పాటు వివిధ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు కాంగ్రెస్ నాయకులు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిందని తెలిపారు.

డ్వాక్రా మహిళలకు 10లక్షల ప్రమాద బీమా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, డ్వాక్రా గ్రూప్ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడితే రెండు లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందించడమే ప్రభుత్వం యొక్క లక్షమని తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలు కొనసాగించడం జరుగుతుందని, డ్వాక్రా మహిళలు సహజ మరణం పొందితే అప్పటి వరకు ఉన్న రుణం మొత్తం మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు.సంక్షేమ పథకాలు అందనివారు డిసెంబర్ 1నుండి 9వరకు జరిగే ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్ చారి,కార్యదర్శులు రాజు, కార్తీక్,రమేష్,మండల సమైక్య అధ్యక్షురాలు శాంతమ్మ,ఐకెపి సీసీ నారాయణ, దత్తు, నాయకులు షాహిద్ పాషా, లక్ష్మణ్ ఠాగూర్, దివిటీ కిష్టయ్య, మునిగేపల్లి సంగయ్య, సాయ గౌడ్, శేఖర్, హనుమాన్లు, షకీల్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.