12-06-2025 07:38:38 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాయితీ జీలుగా విత్తనాలు పంపిణి చేశారు. బెల్లంపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సహకార సంఘ ఛైర్మెన్ చింతం స్వామి(Chairman Chintam Swamy)తో కలిసి జిల్లా వ్యవసాయ అధికారిని కల్పన జీలుగా విత్తనాల పంపిణి చేశారు. మండలానికి 333 జీలుగా విత్తనాలు వచ్చాయని, 30 kg ల బస్తా ధర రూ.2138, కాగా ఇది సబ్సిడీ ధర అని, వరి వేసే రైతులు జీలుగా వేసుకోవాలని, ఒక బస్తా 2-3 ఎకరాలకు వేసుకోవచ్చునని కల్పన తెలిపారు. కార్యక్రమంలో బెల్లంపల్లి మండలం వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్, ఏ ఈ ఓ లు శ్రీనివాస్, తిరుపతి, రైతులు పాల్గొన్నారు.