15 April, 2026 | 3:57 AM

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

15-04-2026 01:20 AM

ఖమ్మం, ఏప్రిల్ 14(విజయక్రాంతి): ఖమ్మం అభివృద్ధి ప్రదాత, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ తరపున 55వ డివిజన్ మహిళలకు స్వయం ఉపాధి అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా అందజేశారు. కార్యక్రమంలో 55వ డివిజన్ కార్పొరేటర్ మోతరపు శ్రావణి సుధాకర్, జీపీవో రాంబాబు, ఆర్‌పీ గోపిక పాల్గొన్నారు.