calender_icon.png 24 June, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్.హెచ్.జీ సభ్యులకు సిరిసిల్ల చీరల పంపిణీ గర్వకారణం

24-06-2025 01:28:02 AM

  1. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

నేతన్నల, రైతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

నేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ

రాజన్న సిరిసిల్ల: జూన్ 23(విజయక్రాం తి) రాష్ట్రంలోని ఎస్.హెచ్.జీ మహిళా సం ఘాల సభ్యులులకు ఇందిరా మహిళా శక్తి కింద సిరిసిల్లలో సిద్ధం చేస్తున్న చీరలు పం పిణీ చేయనుండడం గర్వకారణమని ప్రభు త్వ విప్, ఆది శ్రీనివాస్ తెలిపారు.మ హిళా సంఘాల సభ్యులు కట్టు కునేలా నా ణ్యమై న చీరలు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

సోమవారం ప్రభు త్వ విప్, ఆది శ్రీనివాస్ సిరిసిల్ల పట్టణంలోని ఇందిరానగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి చీరల నా ణ్యతను పరిశీలించారు. అనంతరం చీరల ఉత్పత్తుల సేకరణ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.

సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేతన్నల, రైతన్నల సంక్షేమం ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, 9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రూపాయలను వానాకాలం పంట పెట్టుబడి క్రింద రై తుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అ న్నారు.నేతలను సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కలెక్టర్ నుంచి చేనేత జౌళి శాఖ మంత్రి,ముఖ్యమంత్రి వరకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని అన్నారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పెండింగ్ బకాయిలను కూడా తమ ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ రం గంలో తయారయిన ప్రతి బట్ట ఆర్డర్ చేనేత కార్మికులకు అందిస్తున్నామని, డబ్బుకు వెనకాడకుండా కమిటి వేసి మహిళలకు మెరు గైన చీరలు అందించేలా ప్రభుత్వం నిర్ణయిం చి,ఆర్డర్ ను ప్రభుత్వం చేనేత కార్మికులకు అందించిందని గుర్తు చేశారు.

రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు సిరిసిల్లలో త యారుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం గర్వకారణమని పేర్కొన్నారు.చేనేత కార్మికులకు, ఆసాములకు చేతి నిండా పని కల్పించడంలో ప్రభుత్వానికి ఆత్మసంతృప్తి ఉందని అన్నారు.చేనేతలకు ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చే సిందని, నూలు సబ్సిడీ బకాయిలను ప్రభు త్వం విడుదల చేసిందని అన్నారు.

మహిళల ఆత్మగౌరవం పెంచేలా మంచి చీరలు పంపి ణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. 4 కోట్ల 30 లక్షల మీటర్ల చీరల ఉత్పత్తి లక్ష్యం ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని అన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్యుత్ బకాయిలసమస్య కూడాపరిష్కరించుకున్నామని అన్నారు.

నేత కార్మి కులను, పవర్ లూమ్ రంగానికి కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నా రు. ప్రజల దశాబ్దాల కల నూలు డిపో ఏర్పాటు చేశామని అన్నారు. పద్మశాలి భవ న్ కు ప్రభుత్వం 5 కోట్ల, 3 కోట్ల రూపాయల సంఘాల నుంచి సేకరించి నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నా రు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా , కార్యక్రమంలో కే కే మహేందర్ రెడ్డి, మార్కెట్ కమి టీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, చేనేత జౌళి శాఖ జేడీ వెంకటేశ్వర్ రావు, ఏడీ రాఘవరా వు తదితరులుపాల్గొన్నారు.