26-06-2025 08:26:52 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాకు చెందిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ట్రస్టు(Sir Mokshagundam Visvesvaraya Trust) ద్వారా హజారియా తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టై, బెల్టుల పంపిణీ చేశారు. పేద విద్యార్థుల ఉన్నతికి దాతల సహకారం అవసరమని, ట్రస్టు చైర్మన్ జానీ చేస్తున్న కృషి అభినందనీయమని, టి పి టి ఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ రమేష్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.