12-06-2025 10:52:04 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫాంలు, పుస్తకాలను ఎంపిడివో ప్రవీణ్ కుమార్(MPDO Praveen Kumar) విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను అందిస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన సిబ్బంది ఉంటారని ఆయన అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి స్థాయిలో ఉండాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపిడివో ప్రవీణ్ కుమార్, ఏం ఈ ఓ విజయ్ కుమార్, ఎ పి ఎం రాజు పాఠశాల హెచ్ ఎం రాధ లక్ష్మీ సిబ్బంది పాల్గొన్నారు.