21-06-2025 10:16:29 PM
సదాశివపేట: సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్ కాలనీలో గల కేజీబీవీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య(District Collector P Pravinya) శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో గల స్టోర్ రూమ్ వంటగదిని విద్యార్థులకు అందజేస్తున్న ఆహారాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఎలా ఉంటుందని నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం నూతన మెనూ ప్రకారం అందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీలో ఆలస్యం జరగడం పట్ల కలెక్టర్ ఎంఈఓ శంకర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుస్తుల పంపిణీ వెంటనే పూర్తి కావాలని ఆదేశించారు, పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఊర్మిళ స్పెషల్ ఆఫీసర్ లలిత లకు షో కాజ్ నోటీసులు ఇచ్చారు, ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.