calender_icon.png 22 June, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగన్న బావి మెట్లపై యోగాసనాలు

21-06-2025 10:19:00 PM

కామారెడ్డి (విజయక్రాంతి): 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ గ్రామంలో నాగన్న గారి మెట్ల బావి దగ్గర యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అందరితో కలిసి యోగ సాధన చేసి  యోగ కార్యక్రమానికి వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడారు. యోగా చేయడం వల్ల శారీరక, ధృడత్వం, కాకుండా, మానసిక, దృఢత్వం కూడా ఏర్పడుతుందని తెలిపారు. అదేవిధంగా యోగ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు వేసిన కఠినతరమైన యోగాసనాలు తిలకించి అభినందించారు. విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... రోజువారి అలవాటులో ఈ యోగాను చేర్చుకోవాలని కోరారు.

దీనివల్ల ప్రతి ఒక్కరూ శారీరకంగానే కాకుండా మానసిక ద్రుడత్వంతో పాటు రోజంతా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. అదేవిధంగా యోగా దినోత్సవంను లింగంపేట్ లోని నాగన్న గారి భావి దగ్గర నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. తద్వారా ఇలాంటి హెరిటేజ్ సైట్లు ఎంతో ప్రాముఖ్యత పొందుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సురేందర్ , జిల్లా పంచాయతీ అధికారి మురళి , జిల్లా వైద్య శాఖ అధికారి చంద్రశేఖర్, యువజన సంక్షేమ శాఖ అధికారి, మండల స్థాయి అధికారులు, యోగా ఇన్ స్ట్రాక్టర్  రామిరెడ్డి, KGBV లింగంపేట్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.