calender_icon.png 6 September, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమజ్జనంలో 4 డీజేలు సీజ్

05-09-2025 10:18:33 PM

ఇచ్చోడ,(విజయక్రాంతి): సుప్రీంకోర్టు నియమ నిబంధనకు లోబడి సౌండ్ బాక్స్లను ఏర్పాటు చేయాలని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం... చర్యలు తప్పవని ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. గురువారం నేరడిగొండ మండలం వడూరు గ్రామంలో గణపతి మండపాల వద్ద నిబంధనలకు అధిక్రమించి ఏర్పాటు చేసిన 4 డీజే లను స్వాధీనం చేసుకొని డీజే యజమానులపై, ఆపరేటర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా అధిక శబ్దం వచ్చే విధంగా డీజే లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గణపతి మండపాల వద్ద ఎలాంటి డీజేలకు అనుమతి లేదని అతిక్రమించిన వారి పై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేరేడిగొండ ఎస్సై ఇమ్రాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.