14-02-2026 12:00:00 AM
ఎన్నికల ముందు వరాలు
చెన్నై, ఫిబ్రవరి 13: తమిళనాడులో అసెం బ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార డీఎంకే ప్రభుత్వం మహిళలకు మరో ఆకర్షణీయ కానుక అందించింది. ‘కలైంజ్ఞర్ మహిళా హక్కుల పథకం’ కింద 1.31 కోట్ల మంది లబ్ధిదారులకు ముందస్తు మూడు నెలల ప్యాకేజీని విడుదల చేసింది. ముంద స్తు రూ.3వేలతోపాటు వేసవి ప్రత్యేక ప్యాకేజీ కింద మరో రూ.2వేలు మొత్తం రూ.5వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేసింది.
సీఎం స్టాలిన్ సోషల్ మీడియాలో ఈ వివరాలు వెల్లడించారు. ఎన్నికల సాకుతో ఈ సాయా న్ని అడ్డుకునేందుకు విపక్షాలు యత్నిస్తున్నా యని మండిపడ్డారు. ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే నెలవారీ రూ.వెయ్యి సాయాన్ని రూ.2వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల పింఛన్లను రూ.1,200 నుంచి రూ.2వేలకు పెంచుతామన్నారు.