14-02-2026 12:00:00 AM
చర్ల, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మా వోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. ఓంగర్ అటవీ పర్వతప్రాంతంలో 29వ బెటాలియన్ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్లు, నారాయణపూర్ పోలీసుల సంయుక్తంగా సెర్చ్ ఆపరే షన్ నిర్వహించారు.
మావోయిస్టులు దాచిపెట్టిన పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీ నం చేసుకున్నారు. 175 మీటర్ల పారిశ్రామిక ప్రైమా కార్డ్ (సుమారు 3.5 రోల్స్) 10 మీట ర్ల సేఫ్టీ ఫ్యూజ్, 10 రోల్స్ ఎలక్ట్రిక్ వైర్, ఐఈ డి మెకానిజం, దేశీయంగా తయారు చేసిన పిస్టల్, 2 స్టీల్ కంటైనర్లు, 15 అడుగుల పొడవున్న భారీ బోరింగ్ పైపు స్వాధీనం చేసుకున్నారు.