15 March, 2026 | 10:54 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతించొద్దు

14-10-2024 01:27 AM

ఎమ్మెల్యే, ఎంపీకి అఖిలపక్ష నాయకుల వినతి 

నల్లగొండ, అక్టోబర్ 13 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతించొద్దని కోరుతూ స్థానిక అఖిలపక్ష నాయకులు ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

రెండేళ్ల క్రితం లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని రైతులను నమ్మించి రామన్నపేట శివారుల్లో 350 ఎకరాలు కొనుగోలు చేసి ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనడం సరికాదన్నారు. లాజిస్టిక్ పార్క్ వస్తే స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో రైతులు భూములు ఇచ్చారని తెలిపారు.

సిమెంట్  పరిశ్రమ ఏర్పాటు చేస్తే వాతావరణ కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని ఎమ్మెల్యే, ఎంపీలను కోరారు. ఇదే అంశంపై ఈ నెల 22న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుందని తెలిసింది.