28 April, 2026 | 3:19 AM

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు

28-04-2026 01:48 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 27: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని సర్పంచ్ నున్న యాదగిరియాదవ్ అన్నారు.సోమవారం మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యనాయక్ తండా సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సత్యం,ఉపసర్పంచులు మాండ్ర గోవర్ధన్,గడ్డం ఉమావెంకన్న,తాడూరి రామకోటి,నున్న సురేష్,వల్లపు శ్రీను,బషీర్,కేంద్ర నిర్వాహకులు సునీత,రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.