31-07-2025 12:11:09 AM
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, జూలై 30 (విజయక్రాంతి) : సీఎమ్మార్ ధాన్యం పెండింగ్ ఉన్న మిల్లులకు వచ్చే సీజన్ లో ఎట్టి పరిస్థితుల్లో కేటాయించేది లేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి పౌర సరఫరాల శాఖ అధికారులతో 2023 - 24 పెండింగ్ పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లాలో బకాయిలు పెండింగులో ఉన్న మిల్లర్లు గడువులోగా సీఎమ్మార్ ధాన్యాన్ని అందించాలని ఆదేశించారు.. బకాయి ఉన్న మిల్లర్లు 100శాతం బ్యాంక్ గ్యారెంటీ ఇస్తేనే ఆ మిల్లులకు సీఎమ్మార్ ధాన్యాన్ని కేటాయించాలన్నారు.
మిల్లర్లు సీఎమ్మార్ ధాన్యాన్ని వేగంగా అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ మోహన్ బాబు, ఏసీఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, ఎయం బెనర్జీ, డీటీలు, ఆర్ ఐ లు పాల్గొన్నారు.