ఓటు వేద్దాం.. చైతన్యాన్ని చాటుదాం
20-04-2024 12:25 AM
వరంగల్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు కలెక్టర్ ప్రావీణ్య చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా యువతను అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తున్నారు. విద్యార్థులను క్యాంపస్ అంబాసిడర్లుగా నియమిస్తున్నారు. ఓటింగ్పై కలెక్టరేట్, పబ్లిక్ గార్డెన్, రైల్వేస్టేషన్, బస్స్టేషన్ వద్ద సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయించారు. దీనిలో భాగంగా శుక్రవారం ఆమె కలెక్టరేట్ సెల్ఫీపాయింట్ వద్ద అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మితో కలిసి ఇలా పొటోకి ఫోజిచ్చారు.






